ఆలయ అర్చకులపై దాడి చేయడం దారుణం

  • ఆలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: ఆలయ అర్చకులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటీఆర్‌ అన్నారు. సోమవారం ఉదయం అర్చకుడు రంగరాజన్‌ను కేటీఆర్‌ కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్‌ కుటుంబం సేవ చేస్తోందన్నారు. రంగరాజన్‌ పై దాడిని ఖండిస్తున్నామని.. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయన్నారు. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా.. ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చూసుకోవాలన్నారు. అవసరమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్‌ వద్ద భద్రతను ఏర్పాటు చేయాలన్నారు.

రంగరాజన్‌ను అవమానించడం అంటే దేవుని అవమానించడమే అని అన్నారు. రంగరాజన్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మరోవైపు రంగరాజన్‌పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రంగరాజన్‌పై దాడి ఘటనలో 17 మంది ఆచూకీని గుర్తించారు పోలీసులు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా.. వారిలో 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిని గుర్తించారు. ఈ ఘటనలో వీర రాఘవ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని సోమవారం మొయినాబాద్‌ పోలీసులు.. అరెస్ట్‌ చేశారు. అలాగే పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News