ఢిల్లీ ఫలితాలు మోడీపై నమ్మకానికి నిదర్శనం: పవన్‌కళ్యాణ్‌

అమరావతి, ఫిబ్రవరి 8: ఢిల్లీ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఎపి డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మోడీ లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకమని ప్రశంసించారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించడంతో జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం శుభపరిణామం అని కొనియాడారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ద్వారానే అభివృద్ధి సాధ్యమని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. బిజెపి హామీలను ప్రజలు నమ్మారని, మిత్రపక్ష నాయకులకు అభినందనలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News