పేదింటి కుటుంబాలకు అండగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు తప్పుడు వాగ్దానాలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెళ్లి చేసుకున్న వారికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తులం బంగారం ఎక్కడ పోయిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. కూకట్ పల్లి నియోజకవర్గం లోని కూకట్ పల్లి, బాలనగర్ మండలాల్లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్లు కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, సబియా గౌసుద్దీన్, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్ ,మహేశ్వరి శ్రీహరి, ఎమ్మార్వో తో కలిసి 290 చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి పేదింటి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేశాడు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదని ఎమ్మెల్యే అన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తారనే ఆశతోనే ఆడపడుచులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే వారికి మొండి చేయి చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటుగా తులం బంగారం ఆడపడుచులకు ఇవ్వకపోతే ఊరుకోమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News