హైదరాబాద్, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో కులగణన నిర్వహించి దేశ చరిత్రలో బిసిలను గుర్తించడమే కాకుండా వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ అన్నారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులేస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి లక్ష్యసాదకుడు అని అయన కొనియాడారు. హైదరాబాద్, వడ్డెర సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. గత ముఖ్యమంత్రి కెసిఆర్ సామజిక అన్యాయానికి పాల్పడగా, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్దతతో అడుగులేస్తున్నారని పేర్కొన్నారు. సామజిక సాధికారత సాధనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికే ఆదర్శమని తెలిపారు.
దేశంలోనే మొట్ట మొదటి సారిగా బిసి కుల గణన చేపట్టి దశబ్దాల కాలంగా వెనకబాటుకు గురైన వెనకబడి తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. కుల గణన చేపట్టడంలో ఇతర రాష్ట్రల ముఖ్యమంత్రి ఎవరూ చేయలేని సాహాసాన్ని రేవంత్రెడ్డి చేసారని తెలిపారు. అంతే కాకుండా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కుల గణన వివరాలను అధికారికంగా ప్రకటించడమే కాకుండా దేశ వ్యాప్తంగా కుల గణనను చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన సాహసవంతుడన్నారు. ఎన్నికలవేళ కామారెడ్డిలో ప్రకటించిన బిసి డిక్లరేషన్ ప్రకారం, అధికారం చేపట్టిన ఏడాది లోపే కులగణనకు శ్రీకారం చుట్టాడని అన్నారు.
52 రోజుల పాటు అత్యంత శాస్రీయంగా కుల గణన చేపట్టి పూర్తి చేసిన ఘనత సిఎం రేవంత్ రెడ్డి దే అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలులో న్యాయ స్థానాల్లో చట్టపరమైన చిక్కులు ఎదురైతే, ప్రస్తుతానికి పార్టీ పరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామని అసెంబ్లీ వేదికంగా ప్రకటించడం గర్హనీయమని అన్నారు. బిసి వర్గాల జనాభా ప్రకారం విద్య, ఉద్యో, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని గుంజ శ్రీనివాస్ పేర్కోన్నారు.