హైదరాబాద్, ఫిబ్రవరి 6: ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో దెబ్బ తిన్న రోడ్లతో స్ధానికుల ఇబ్బందులను గుర్తించి, కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జవహార్ నగర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన, కాలనీ వాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ లో రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్ధానికులు కార్పొరేటర్ కు విన్నవించారు. కాలనీవాసుల అభ్యర్థన మేరకు, నిధులు మంజూరు చేయించి తప్పకుండా మీ కాలనీ లో రోడ్ వేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్, నారాయణ, మల్లేష్ గౌడ్, జాన్, కేసిరెడ్డి, ముత్యంరెడ్డి, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
