కులగణనను రీ సర్వే చేయాలి.. తలసాని డిమాండ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: ప్రభుత్వం కులగణనను రీ సర్వే చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లో గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులతడకగా ఉందన్నారు. సర్వే లెక్కలలో ఎలాంటి స్పష్టత లేదన్నారు.ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.’

2014లో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024 లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన సర్వే లో 62 లక్షల మంది జనాభా తగ్గింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేసి ఎన్నికల లో ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తలసాని అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News