తెలంగాణలో పీఈ సెట్‌.. ఎడ్‌ సెట్‌ షెడ్యూల్‌

  • వివరాలు వెల్లడించిన ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: తెలంగాణలో పీఈ సెట్‌, ఎడ్‌ సెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న పీఈ సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.

జూన్‌ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను కాకతీయ వర్సిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్‌ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News