- ఏటా పండుగలా నిర్వహించాలని ఛాంబర్ నిర్ణయం
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీని తెలుగు సినిమా దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని, అలాగే ఛాంబర్ తరఫున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు, నటీనటులకు అవార్డులు, పద్మ ఇంకా ఇతర అవార్డులు పొందిన వారందరినీ సన్మానించాలనేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ’భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా పుట్టిన రోజుగా ఇకపై గ్రాండ్గా సెలబ్రేట్ చేయనున్నట్లుగా తెలుపుతూ.. ఆ రోజున ప్రతి నటీనటుడి ఇంటిపైన, అలాగే రాష్ట్రంలోని థియేటర్లపైనా జెండా ఎగురవేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజుకు సంబంధించిన జెండా రూపకల్పన బాధ్యతను సీనియర్ సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. గురువారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన విూడియా సమావేశంలో ప్రముఖులు పాల్గొని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
ఈ ఏడాది సింపుల్గా ప్రారంభించి, ప్రతి ఏడాది ఘనంగా చేయదలిచాము. తెలుగు సినిమా పుట్టుకను రాబోయే తరాలకు కూడా గుర్తుండేలా చేయాలన్నదే మా ప్రయత్నం. తెలుగు సినిమా చరిత్ర రాబోయే తరాలకు తెలియాలనే తెలుగు సినిమా దినోత్సవం జరపుతున్నాము. వచ్చే ఏడాది నుంచి గ్రాండ్గా సెలెబ్రేట్ చేయటంతో పాటు.. ఆ ఏడాది ప్రతిభావంతులకు, పద్మ అవార్డ్ గ్రహీతలను సన్మానించే పరిశీలన చేస్తున్నాము. గద్దర్ అవార్డ్స్పై తెలంగాణ ప్రభుత్వం ప్రొ యాక్టివ్గా ఉంది. సినిమా ఇండస్టీ గురించి, వ్యక్తుల గురించి తక్కువ చేసి మాట్లాడే వారిని ఎప్పటికప్పుడు ఛాంబర్ కట్టడి చేస్తూనే ఉంది. వివాదాస్పద కామెంట్స్ చేసే వారు తామెంటో కూడా చూసుకోవాలని సూచించారు. ’భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు.
తమిళ వాళ్లు మాది అని చెప్పుకునే ’కాళిదాసు’ మన తెలుగు సినిమానే. హిందీ తొలి సినిమా ’ఆలం ఆరా’, తెలుగు వారి ’భక్త ప్రహ్లాద’, తమిళ వారి ’కాళిదాసు’ ఇలా అన్నీ సినిమాల్లో ఎల్ వి ప్రసాద్ యాక్ట్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్టీక్రి రెండు కళ్లలా తెలుగు సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించారు. సినిమా వారంతా గర్వపడే రోజు ఇదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 6ను ప్రతి ఏడాది తెలుగు సినిమా దినోత్సవంగా గ్రాండ్గా జరపనున్నాం. 1973లో నన్ను అట్లూరి పూర్ణచంద్రరావు పరిచయం చేశారు. వారు సినిమా రిప్రజంటేటివ్గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని నటుడు మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.