గచ్చీబౌలిలో బెంగాలీ యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: హాస్టల్‌ భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిరది. ఈ విషాదం సంఘటన సిటిలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితోజీ బసు (22) అనే యువతి.. గచ్చిబౌలి సిద్ధిక్‌ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం హాస్టల్‌ బిల్డింగ్‌ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News