గొంగడి త్రిషకు సిఎం అభినందనలు

  • కోటి రూపాయాల నజరానా ప్రకటన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: క్రికెటర్‌ గొంగడి త్రిషన్‌ సిఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. అలాగే ఆమెకు కోటి రూపాయాల నజరానా ప్రకటించారు. తెలంగాణలో క్రీడాకారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో రాణించిన క్రికెటర్‌ గొంగడి త్రిష బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా త్రిషను అభినందించి, శాలువాతో సీఎం సత్కరించారు. ఆమెకు రూ.కోటి నజరానా ప్రకటించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News