హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఎస్సీ ఉప కులాల వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పిడమర్తి రవి, ఖమ్మం జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో సిఎంను కలిసి ఎస్సీ వర్గీకరణ ఆమోదం సాహసోపేత నిర్ణయంగా ప్రకటించారు. అందుకు ఎస్సీలు కృతజ్ఞతగా ఉంటారని అన్నారు. రాష్ట్రం లో ఎస్సీల వర్గీకరణ అంశానికి త్వరలో చట్టబద్ధత కల్పిస్తామని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉం డేందుకు వీలుగా చట్టబద్ధ్దత దోహదం చేస్తుందన్నారు.
ఆ దిశగా తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలోని ఉప కులాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన క్రిమిలేయర్ను తిరస్కరించినట్లు సిఎం చెప్పారు. మంగళవారం శాసనసభలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై ప్రకటన చేశారు. వర్గీకరణకు మద్దతు ప్రకటించిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.