కేంద్రమంత్రుల వ్యాఖ్యలు దారుణం

  • నిరసన తెలిపిన కేరళ ఎంపిలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కేరళను నిరంతరం ఎగతాళి చేస్తున్న కేంద్ర సహాయ మంత్రులు సురేష్‌ గోపి, జార్జ్‌ కురియన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్టాన్రికి కి చెందిన వామపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన తెలిపారు. సురేష్‌ గోపి, జార్జ్‌ కురియన్‌ రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఆయన రాజీనామా చేయడానికి ఇష్టపడకపోతే, ఆయనను మంత్రిత్వ శాఖ నుండి తొలగించాలి. సీపీఐ-ఎం లోక్‌సభ నాయకుడు కె. రాధాకృష్ణన్‌, రాజ్యసభ ఉప నాయకుడు జాన్‌ బ్రిట్టాస్‌ నిరసనకు నాయకత్వం వహించారు.

గిరిజన సంక్షేమ శాఖను అగ్రవర్ణాలకు ఇవ్వాలన్న సురేష్‌ గోపి వ్యాఖ్యను కూడా వామపక్ష ఎంపీలు నిరసించారు. కేరళ తరపున మాట్లాడాల్సిన కేంద్ర మంత్రులు నిరంతరం కేరళను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కె.రాధాకృష్ణన్‌ అన్నారు. రాష్టాన్ని ఆర్థికంగా బలహీనపరిచే ప్రణాళికాబద్ధమైన చర్యలో కేరళకు చెందిన కేంద్ర మంత్రులు కుట్ర పన్నుతున్నారు. సురేష్‌ గోపి వ్యాఖ్య రాజ్యాంగ విరుద్ధమని రాజీనామా చేయాలని రాధాకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News