హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రియదర్శిని పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రియదర్శిని పార్క్ లో హెచ్ఎండిఏ ఏ. ఈ రంజిత్ కుమార్ మరియు అధికారులతో కలిసి జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు పార్కుకు చిన్నపిల్లలు, విద్యార్థులు, యువకులు మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారని ఆయన తెలిపారు .గతంలో పార్కును పరిశీలించి పార్కులో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి మరమ్మత్తుల పనులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. చెడిపోయిన పిల్లల ఆటో పరికరాలను మార్చడంతో పాటు నూతన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు. మరియు పచ్చదనం సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
టాయిలెట్లను తొలగించి కొత్త టాయిలెట్లను నిర్మించడంతోపాటు, పెయింటింగ్, మాన్యువల్ కవర్స్ ఇంకా వీధి దీపాలను మరమ్మతులు చేయించి లేనిచో మార్పిడి చేసి కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైలింగ్లను భద్రత కోసం సీసీ కెమెరాలు మార్పిడి చేయాలని ఆయన సంబంధిత అది కారులను ఆదేశించారు. పార్కు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులను పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .నిత్యం పార్కులో ప్రతిరోజు వందలాదిమంది వాకింగ్ చేసుకుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ప్రియదర్శిని పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు కట్టే పన్నుతో ప్రజలకు అవసరం ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమేష్ సింగ్, ప్రవీణ్ రెడ్డి, రోహిత్, నరేందర్ పాల్గొన్నారు.