ప్రపంచానికి సవాల్‌గా.. క్యాన్సర్‌ మరణాలు

  • వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌

అమరావతి, ఫిబ్రవరి 4: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాప్తి పెను సవాల్‌ గా మారిందని ఎపి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఇప్పటి వరకు 17.5 శాతం కాన్సర్‌ కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. 9 శాతం మరణాలు క్యాన్సర్‌ వాళ్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రజలకు సరైన అవగాహన లోపం, సరైనా టైంలో చికిత్స లేకపోవడంతో మరణాలు కొనసాగుతున్నాయి.. క్యాన్సర్‌ రోగానికి చికిత్స పోందితే నయం అవుతాయి.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్‌ బాధితులను అదుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నామని మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులను గుర్తించే పక్రియ చేస్తున్నామని మంత్రి సత్య కుమార్‌ అన్నారు. సినీ నటులు కాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం.. ప్రజలు కూడా క్యాన్సర్‌ పరీక్షలను భయపడకుండా చేయించుకోవాలి.. అప్పుడు, ఈ క్యాన్సర్‌ అనే భూతాన్ని మన రాష్ట్రం నుంచి తరమి కొడతామని తెలిపారు. అలాగే, కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ పై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది అని చెప్పారు. ఈ బ్జడెట్‌ లో ప్రధాని మోడీ పేద, మధ్య తరగతి, రైతులకు న్యాయం జరిగేలా చూశారని మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News