హైదరాబాద్, ఫిబ్రవరి 3: డిప్యూటీ సిఎం, ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో బీసీ కమిషన్ సమావేశం అయ్యింది. ఉమ్మడి జిల్లాల పర్యటనలో పలు కులాల పేరు మార్పు అభ్యంతరాలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ , బీసీ కమిషన్ సభ్యులు మహాత్మా జ్యోతిభాపూలే ప్రజా భవన్ లో మల్లు భట్టి విక్రమార్క తో భేటీ అయ్యారు. ఇప్పటికే బీసీ కమిషన్ 10 ఉమ్మడి జిల్లాల పర్యటన తరువాత వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొన్ని కులాల పేర్లు మార్పులు, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత వచ్చిన అన్ని అంశాలను వివరించారు. బిసి కవిూషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి బాలలక్ష్మీ రంగు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో చర్చించడం జరిగింది. వివిధ విజ్ఞప్తులను వాటి పర్యవసానాలను మంత్రితో కూలంకషంగా చర్చించడం జరిగింది. బిసి కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన విషయమై సవివరంగా చర్చించారు.
