తెలంగాణ ఈఏపీ సెట్‌ ఖరారు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3: తెలంగాణ ఈఏపీ సెట్‌ ఖరారైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈఏపీ సెట్‌ పరీక్షలు జేఎన్‌టీయూ నిర్వహించ నుంది. తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. జూన్‌ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News