కులగణనలో.. పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలివ్వొచ్చు

  • అన్ని వర్గాలకు ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
  • తప్పుడు వార్తల వ్యాప్తి చేయడం బలహీన వర్గాలపై దాడే
  • వివరాలకు వచ్చిన అధికారులుపై కుక్కలను వదిలారు
  • బీసీ రిజర్వేషన్లపై ప్రతి పార్టీ తమ వైఖరి స్పష్టంచేయాలి
  • ప్రతిపక్షాల అడ్డంకులను ఎదుర్కొంటాం
  • బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో 96శాతం సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామని, సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. గాంధీభవన్‌ లో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు అన్ని వర్గాలకు ఫలాలు అందాలనే ఉన్నత లక్ష్యంతోనే కులగణన సర్వే చేశామని చెప్పారు. సర్వేకు వెళ్లిన అధికారులపైకి కుక్కలను వదిలారని, సర్వే సజావుగా సాగనీయకుండా అనేక అడ్డంకులు సృష్టించారని పొన్నం గుర్తు చేశారు. అప్పుడు సర్వేల్లో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు. కులగణన సర్వేపై తప్పుడు వార్తలను వ్యాపింపజేయడం అంటే అది బలహీనవర్గాలపై దాడే అవుతుందని చెప్పారు.

ప్రతిపక్షాల అడ్డంకులను ఎదుర్కొంటామని మంత్రి చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న కులగణన సమస్యను పరిష్కరించామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతి రాజకీయ పార్టీ స్టాండ్‌ చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. సమగ్ర కులగణన సర్వే చేపట్టిన కేసీఆర్‌.. ఇప్పటి వరకు ఆ వివరాలను బయటపెట్టలేదని పొన్నం ప్రభాకర్‌ గుర్తు చేశార. పదేండ్ల పాటు సమాచారాన్ని దాచిన ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబంలో కవిత మాత్రమే వివరాలు ఇచ్చారని చెప్పారు. మిగతా ఎవరూ తమ వివరాలను సర్వే అధికారులకు వెల్లడిరచలేదని చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News