లావణ్య.. రాజ్‌ తరుణ్‌ల వివాదం

  • కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్‌ సాయి అరెస్ట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3: లావణ్య రాజ్‌ తరుణ్‌ ల వివాదం ఆ మధ్య టాలీవుడ్‌ లో తీవ్ర దుమారం రేపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్‌ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం మస్తాన్‌ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్‌ తరుణ్‌ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్‌ సాయి అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్‌ చేసినట్లు మస్తాన్‌ సాయిపై ఆరోపణలు ఉన్నాయి.

ప్రైవేట్‌గా గడిపిన వీడియోలతో మస్తాన్‌ సాయి బ్లాక్‌ మెయిల్‌ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తనకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్‌ సాయి రికార్డ్‌ చేశాడని పేర్కొన్న లావణ్య.. వీడియోలను పోలీసులకు అందజేసింది. మస్తాన్‌ సాయి హార్డ్‌ డిస్క్‌ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు మస్తాన్‌ సాయి. అంతే కాకుండా గతంలో ఏపీలో కూడా డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మస్తాన్‌ సాయి అరెస్టుతో మళ్ళీ తెరపైకి వచ్చిన లావణ్య రాజ్‌ తరుణ కేసులో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News