- తెలంగాణలో 50 నుంచి 52 శాతం బిసిల సంఖ్య
- బిసి గణన నివేదికపై అనుమానాలు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై బిల్లు
కరీంనగర్, ఫిబ్రవరి 3: బిసి కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కులగణన నివేదికపై సోమవారం కరీంనగర్ లో ఆమె విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో కోటి 15 లక్షల ఇళ్లు, జనాభా 3. 70 కోట్లు అని తేల్చిందని , అయితే దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బిసిలు ఉన్నట్లు తెలుస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చారని ఆరోపణలు చేశారు. బిసిలు 46 శాతం ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి గుండె విూద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. కరెక్టే అయితే సర్వేలో తానిచ్చిన వివరాలు, తన పేరు ఆధార్ కార్డు కొడితే రావాలని చెప్పారు. సర్వే రిపోర్ట్ ను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాలని కవిత డిమాండ్ చేశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిస్ అయిన వారి కోసం మళ్లీ అవకాశం ఇవ్వాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
శాసనసభలో లఘు చర్చతో లాభం లేదన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేమెంతుంటే.. మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని గుర్తుచేశారు. దానిప్రకారం 46.3 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లీంలు.. మొత్తం కలిపి 56 శాతం జనాభా ఉందని చెప్పారు. రిజర్వేషన్లను అమలు చేయాలంటూ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ.. బీసీల విషయంలో ఎందుకు వెనక్కితగ్గుతున్నారని నిలదీశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని చెప్పారు. 2014లో నాటి సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 1.03 కోట్ల ఇండ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలిందని వెల్లడించారు. అప్పడు నాలుగేండ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇండ్లు పెరిగాయి.
2014-2024 వరకు పదేండ్లలో ఎన్ని ఇండ్లు, ఎంత జనాభా పెరిగి ఉండాలన్నారు. ఎన్ని కుటుంబాలు పెరగాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనతో కోటి 15 లక్షల ఇళ్లు ఉన్నాయని, రాష్ట్ర జనాభా 3 కోట్ల 70 లక్షలు అని చెబుతున్నదని తెలిపారు. 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇండ్లు పెరిగితే.. 2014 నుంచి పదేండ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలన్నారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుందని వెల్లడిరచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 46.2శాతం ఉన్నట్లు తేల్చడం బాధాకరమని చెప్పారు. ఇది ఎంతవరకు సబబని సీఎం రేవంత్ రెడ్డి గుండెవిూద చేసుకుని చెప్పాలన్నారు. ఈ కాకి లెక్కలతో అయినా బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మోసాన్ని బీహార్, కర్ణాటకలో చేసిందని విమర్శించారు.
తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సర్వేకు, ఇప్పటి ఈ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తున్నదని చెప్పారు. సకల జనుల సర్వేలో ఓసీల జనాభా చాలా తక్కవ అని తేలిందని, ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నదని వెల్లడిరచారు. దీని వెనుకున్న మతలబు ఏమిటో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారని, ఆ సర్వే డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాల వల్ల బీసీ జనాభా వివరాలను ప్రభుత్వం బహీర్గతం చేసిందన్నారు. దీన్ని ప్రజాస్వామిక వాదులంతా స్వాగతించాలని చెప్పారు. తెలంగాణ జాగృతి ఉద్యమాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారానే కులగణన జరగాలని కోరినా ప్రభుత్వం ప్లానింగ్ శాఖ చేత సర్వే చేయించిందని విమర్శించారు.
సర్వే సరిగ్గా జరలేదని ప్రతి ఒక్కరి మనసుల్లో ఉందని చెప్పారు. తమ ఇండ్లకు సర్వే కోసం రాలేదని ప్రతీ గ్రామంలో చాలా మంది అంటున్నారని వెల్లడిరచారు. సర్వే సరిగ్గా జరగకపోతే డేటా వాస్తవమైనదా కాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వెల్లడిరచారు. బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సర్వే డేటాను సవిూక్షకు పెట్టాలని డిమాండ్ చేశారు. 3.5 కోట్ల సర్వే పత్రాలను ప్రజల స్కూట్రినికీ అందుబాటులోకి పెట్టాలని, స్కూట్రినీకి 15 రోజుల సమయం ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో దీనిపై కేవలం స్వల్పకాలిక చర్చ పెడుతామని ప్రభుత్వం చెప్పడం బాధాకరమని చెప్పారు. బీసీలంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారని నిలదీశారు. బీసీ అంశాలు, ఎస్సీ వర్గీకరణ అంశంలో రాజకీయాలు తగదన్నారు.