రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’

విక్టరీ వెంకటేష్‌ కథానాయకుడిగా వచ్చిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేగాకుండా తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. మరోవైపు టాలీవుడ్‌ నుంచి సీనియర్‌ నటులలో రూ.300 కోట్ల క్లబ్‌లో ఎంటర్‌ అయిన నటుడిగా వెంకీ మామ రికార్డు సృష్టించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అంతర్జాతీయ స్థాయిలో టాప్‌ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్‌)భారత్‌ పర్యటనకు వస్తారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయనను ముఖ్యమంత్రి (నరేశ్‌) తెలంగాణకు ఆహ్వానిస్తారు.

పార్టీ ప్రెసిడెంట్‌ (వీటీవీ గణేశ్‌) స్పెషల్‌ పార్టీ అని సత్య ఆకెళ్లను తన ఫాంహౌస్‌ను తీసుకెళ్లడంతో కొందరు దుండగులు సత్య ఆకెళ్లను కిడ్నాప్‌ చేసి.. జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తారు. ఇక సత్య కిడ్నాప్‌ అంశం బయటకు వస్తే రాష్ట్ర పరువు పోతుందని భావించిన సీఎం మాజీ పోలీసాఫీసర్‌ ఐడీ రాజు (వెంకటేశ్‌)ని తేవాలనుకుంటాడు. అయితే నిజాయితీ గల ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయిన వైడీ రాజు రాజమండ్రిలో తన భార్య (ఐశ్వర్యరాజేశ్‌) పిల్లలతో హాయిగా గడుపుతుంటాడు. దీంతో రాజును తీసుకొచ్చేందుకు సత్యకు సెక్యూరిటీ ఇచ్చిన అతని మాజీ ప్రేయసి (మీనాక్షి చౌదరి) వెళ్తుంది. ఇంతకీ రెస్య్కూ ఆపరేషన్‌ చేసేందుకు వైడీ రాజు ఒప్పుకున్నాడా..? మీనాక్షి, రాజు విడిపోయేందుకు కారణాలేంటి.. ప్రేయసి వచ్చాక రాజు భార్య ఎలా మారింది.. సత్య ఆకెళ్లను కిడ్నాప్‌ నుంచి రాజు కాపాడాడా..? అన్నదే కథ.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News