- ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ట్రంప్ చర్యలతో వచ్చే నష్టమేవిూ లేదని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసాగా ఉన్నారు. ముందునుంచి హెచ్చరిస్తున్నట్టుగానే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా పైనా సుంకాల కొరడా.. అలాగే ఇప్పటికే పలుమార్లు భారత్ను టారిఫ్ కింగ్ అని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత్ ఆందోళన చెందుతుందా.. అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దీనిపై ఎలాంటి ఆందోళన చెందడం లేదు. భారత్ తయారీ కేంద్రంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. మా సేవల రంగంలో బలంగా ఉన్నాం. సాప్ట్వేర్, ఏఐ, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా భారత్ స్వదేశీ సామర్థ్యం కలిగిఉంది. మన బలాలేంటో మనకు తెలుసు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. భారత్లో అందుబాటులో లేని కొన్ని ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవాలి. అలాంటి వాటిపై అధిక సుంకం విధించి, భారత్లోకి రాకుండా ఆపడం వల్ల ఏ ప్రయోజనం లేదు.
ఉత్పత్తి, తయారీ, ఎంస్ఎంఈలకు సంబంధించి భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది‘ అని మంత్రి వెల్లడిరచారు. ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం భారత్పై ఎలా ఉండనుంది.. అనే ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ‘ఆ టారిఫ్ల ప్రభావం పరోక్షంగా మనపైనా ఉండొచ్చు. అయితే అది ఏ స్థాయిలో ఉండనుందనేది ప్రస్తుతానికి అంచనా వేయలేం. మేం మాత్రం అత్యంత అప్రమత్తతతో పరిస్థితులను గమనిస్తున్నాం‘ అని తెలిపారు. దీర్ఘకాలిక మిత్రదేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. తాము చేసిన సాయానికి ప్రతిఫలం ఇదా అని కెనడా వాపోగా, తాజా పరిణామాల వేళ తాము తలవంచబోమని మెక్సికో తేల్చిచెప్పింది. ట్రంప్ చర్యలపై మండిపడిన చైనా.. డబ్ల్యూటీవోలో సవాలు చేస్తామని ప్రకటించింది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారీ బెదిరించకుండా, ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది.