న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వార్షిక బడ్జెట్ 2025-26కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టకు ముందు బడ్జెట్ను కేబినేట్ ఆమోదించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేబినేట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి ఆర్థిక మంత్రి అందించారు. అధికారులతో కలసి ఆమె స్వయంగా రాష్ట్రపతి భవన్ వెళ్లి బడ్జెట్ కాపీని అందించారు. దీంతో ఆనవాయితీగా రాష్ట్రపతి ముర్ము నిర్మలమ్మకు స్వీట్ తినిపించారు. శనివారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
