న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ నిర్మలమ్మను ప్రశంసించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ నిర్మలాసీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. బడ్జెట్ చాలా బాగుంది అని మోదీ ఆమెతో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు.. బడ్జెట్ ప్రసంగంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడంలో దోహదపడుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.