వికారాబాద్, ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి నియోజకవర్గంలో పర్యటించారు. పూడూరు మండలం సోమన్గుర్తి గేటు వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. కేటీఆర్కు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
