విద్యార్థులతో.. కారు కడిగించిన టీచర్‌

  • విచారణ చేపట్టిన అధికారులు.. తల్లిదండ్రుల ఆగ్రహం

అమరావతి, ఫిబ్రవరి 1: ముగ్గురు విద్యార్థులతో ఓ ఉపాధ్యాయురాలు తన కారును కడిగించిన సంఘటన రాజమండ్రి జిల్లా రంగంపేట మండలంలోని వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. పైగా స్థానిక ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ సంఘటన గురించి విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ పాఠశాలలు.. విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యతనిచ్చే స్థలాలుగా ఉండాలని పేర్కొన్నారు. చట్టాల ప్రకారం ఉపాధ్యాయులైనా సరే, విద్యార్థుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పని చేయించే ఏ విధానమైనా కూడా విద్యార్థుల విషయంలో అనుకూలంగా ఉండాలన్నారు. ఒకవేళ విద్యార్థులపై పని ఒత్తిడి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యా, బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, ఇలా విద్యార్థులతో పనులు చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పనులు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పిల్లల సంరక్షణ బాధ్యత ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలకార్మిక చట్టం ప్రకారం, 14 సంవత్సరాల వయస్సులోపు చిన్న పిల్లలు పనుల్లో పాల్గొనడం నిషేధించబడిరది. ఇది విద్యార్థులను అనవసరంగా పనిలో బలవంతం చేయడాన్ని అరికట్టడానికి రూపొందించబడిరది. 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థులందరూ పాఠశాలలో చదువు, ఆటలు ఇతర సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనాలని తెలుపుతుంది. ఈ చట్టం ప్రకారం విద్యార్థులను ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ రంగంలో అనవసరమైన పనుల్లో బలవంతంగా పనిచేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News