రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్‌ పరివారం అహంకారం

  • గిరిజన మహిళ పట్ల ఇంతటి దురహంకారమా
  • సోనియా, రాహుల్‌ తీరుపై మండిపడ్డ మోదీ

న్యూఢిల్లీ, జనవరి 31: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల కాంగ్రెస్‌ నాయకత్వం అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని మోదీ ఆరోపించారు. ‘షాహి పరివార్‌(రాజకుటుంబం) అహంకారాన్ని చూడండి. గిరిజన నేపథ్యం నుంచి వచ్చి ప్రెసిడెంట్‌ ద్రౌపది ముర్ముని అవమానించారు. షాహి కుటుంబ సభ్యుడు ఒకరు ప్రసంగాన్ని ‘బోరింగ్‌‘ అని అభివర్ణించారు. మరొకరు పాపం అంటూ గిరిజనులను అవమానించారు‘ అని సోనియా గాంధీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందు పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు.

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి చివరికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం‘ అని సోనియా గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రసంగాన్ని ‘బోరింగ్‌‘ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగంగా అత్యున్నత పదవిని కాంగ్రెస్‌ అవమానించిందని, గిరిజనులపై కాంగ్రెస్‌ వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని ఆరోపించింది. అయితే, తన తల్లి సోనియాగాంధీ వ్యాఖ్యలపై ఎంపీ ప్రియాంకా గాంధీ వివరణ ఇచ్చారు. ’ నా తల్లి 78 ఏళ్ల మహిళ. రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగం ద్వారా అలసిపోయినట్లు మాత్రమే చెప్పారు. రాష్ట్రపతిపై తమకు పూర్తి గౌరవం ఉందని, ఈ విషయాన్ని విూడియా వక్రీకరించడం దురదృష్టకరం‘ అని ఆమె అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News