తెలంగాణను అప్పులకుప్పగా చేసిన ఘనుడు కెసిఆర్‌

  • పదేళ్లలో 7లక్షల కోట్లు అప్పు చేసి.. దనిక రాష్ట్రమని అబద్దాలు
  • ఫామ్‌హౌజ్‌ జీవితంతో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి
  • ఎవరేం చేశారో లెక్కలు చెప్పడానికి నేను సిద్దం
  • అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతా.. ఎవరేం చేశారో తేలుద్దాం
  • టిక్‌టాక్‌ లైకులతో సంబరపడి పోతున్న కెసిఆర్‌
  • మొగిలిగిద్ద సభలో నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ రెడ్డి

రంగారెడ్డి, జనవరి 31: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి, రాష్ట్రంపై ఏడు లక్షల కోట్లు అప్పు పెట్టిన కెసిఆర్‌, చెల్లని వేయి రూపాయిల నోటు లాంటి వాడని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రద్దయిన వెయ్యి నోటు లాంటి వారు.. ఆయనకు విలువలేదు. ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆయనకు ప్రజలతో సంబంధాలు తెగిపోయినట్లున్నాయి. ఇప్పుడు మెదడు కూడా సరిగా పనిచేయడం లేదని ఘాటు విమర్వలు చేశారు. ప్రజలు తిరస్కరించినా భారాస మారలేదు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. గట్టిగా కట్టె పట్టుకుని నిలబడలేడు.. గంభీరంగా గమనిస్తున్నారట.. ఆయన కొడుకును, అల్లుడిని అచ్చోసిన ఆంబోతుల్లా వదిలారు.. అంటూ ఘాటు విమర్శలు చేశారు. రూ.7లక్షల కోట్లు అప్పు చేసి 2023లో మాకు అప్పగించారు. గత ప్రభుత్వం రూ.18వేల కోట్లే రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది.

మేం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతాం. ఫామ్‌హౌస్‌లో ఉండి సోది చెప్పటం కాదు.. అసెంబ్లీకి రండి.. లెక్కలు చెబుతాం. ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో శాసనసభలో పెడతాం. కేసీఆర్‌కు చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. రైతు భరోసా ఎగ్గొడతారని కేసీఆర్‌ చెబుతున్నారు. విూలాగా మాట తప్పే వ్యక్తిని కాదు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అని అనేక హావిూలు ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్‌ది. పదేళ్లు పాలించి ప్రజల దగ్గరకు వెళ్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని హావిూ ఇచ్చి.. ఇక్కడి ప్రాజెక్టులను పండబెట్టారని విమర్శలు గుప్పించారు. భారాస పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చాం. సోషల్‌ విూడియాలో నాకంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయంటు న్నారు. కేంద్రమంత్రి, సీఎంగా చేసిన కేసీఆర్‌ సోషల్‌ విూడియాలో లైక్‌లు చూసి సంబరపడుతున్నారు.

అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొంటే. విూరో.. నేనో తేల్చుకుందాం. ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఎవరూ బాధపడటం లేదు. రూ.2లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, ఆరోగ్యశ్రీ రూ.10లక్షలు, రైతు భరోసా పథకాలు అమలు చేస్తున్నాం‘ అని సీఎం వివరించారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చినట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను విమర్శించారు. తెలంగాణను అప్పుల గండం నుంచి గట్టెక్కించినట్లు ధ్వజమెత్తారు. 2023లో మా వద్దకి రూ.7 లక్షల కోట్లు అప్పు చేయడంతో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం రూ.18వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసింది. ఈ రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి లెక్కలు చెబుతారని నమ్ముతుంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండి సోది మాట్లాడటం కాదు, నిజం చెప్పాలి.

అసెంబ్లీకి రమ్మని, రైతులకు ఎన్ని రుణమాఫీలు చేశామో అసెంబ్లీ ముందు వివరంగా చెప్పాలని అన్నారు. కేసీఆర్‌ కు చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. దళితుల కోసం 3 ఎకరాల భూమి, దళిత సీఎం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు వంటి హావిూలను ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్‌ కు ఉంటే, అది ప్రజల్ని మోసం చేయడమే అని రేవంత్‌ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్‌, ప్రజల నుంచి తప్పించి పార్లమెంట్‌ ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి హావిూ ఇచ్చి, స్వంత ప్రాజెక్టులలో రుణాలు చెయ్యడమే అన్యాయంగా ఉందన్నారు. అంతేకాకుండా..’అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్‌ వరకు కేసీఆర్‌ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే.

కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం. మేం రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్‌ ఫాం హౌస్‌ కు వచ్చినోళ్లకు చోద్యం చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం.. రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం.. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా.. నీలా ఇచ్చిన హావిూలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు.. ఆయన గంభీరంగా చూస్తున్నడట.. ఎవరిని చూస్తున్నావ్‌ అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరివిూదకు వదిలిండు. జహంగీర్‌ పీర్‌ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినవ్‌.. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్‌.. మాప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసానూ ఇస్తున్నం.. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం.. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం.

మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా.. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకో.. ట్విట్టర్‌ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్‌ విూడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి.. కేసీఆర్‌ ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో.. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం.. పొంకనాలు కొట్టుడు కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం.. ఫాం హౌస్‌ లో ఉన్న కేసీఆర్‌ కు ప్రజలతో బంధం తెగిపోయింది.. కేసీఆర్‌ కాలం చెల్లిన వెయ్యి నోటు.. కేసీఆర్‌ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్‌ హౌస్‌ లోనే పడుకో’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News