హైదరాబాద్, జనవరి 31: టాలీవుడ్ లో.. విషాదం, సినీ నిర్మాత వేదరాజు టింబర్(54) ఇకలేరు. ఇవాళ(శుక్రవారం) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు వయసు 54 సంవత్సరాలు.‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు నిర్మాణ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు. మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న వేళా.. ఈ విషాదకర సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
