ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్తుందని తెలిసింది. ఎన్టీఆర్ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్నది. త్వరలో టైటిల్ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇదిలా వుండగా ఎన్టీఆర్- హృతిక్రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకురానుంది.
