జీవితంలో.. వారిని ఎప్పటికీ వదులుకోను

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. మాయోసైటిస్‌ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న సామ్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు కమిట్‌ అవుతుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించింది.ఈ చిత్రంలో నటుడు విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు.. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాల్లో సినిమాలకు దూరం అయ్యింది. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంది.ఇక బ్రేక్‌ తీసుకున్న తర్వాత సోషల్‌ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ చిన్నది. రకరకాల ఫోటోలు, వీడియోలతో పాటు మోటివేషనల్‌ కొటేషన్స్‌ కూడా షేర్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు సామ్‌ తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది.

ఇటీవలే రెండు మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిలా ఉంటే సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌ గా ఫోటోలు , మోటివేషనల్‌ కొటేషన్స్‌ షేర్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా సమంత రీసెంట్‌గా చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అని తెలిపింది. మయోసైటిస్‌ కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రతిరోజు అతను తన దగ్గరకు వచ్చిన ఎంతో ధైర్యం చెప్పేవాడని, కొంత సమయం నాతో గడిపి జోక్స్‌ వేస్తూ తనను నవ్వించేవాడని, చిన్మయి కూడా తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అని తెలిపింది. జీవితంలో వారిని ఎప్పటికీ వదులుకోను అని సామ్‌ చెప్పుకొచ్చింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News