- హిమాచల్ సీఎంతో భట్టి విక్రమార్క భేటీ
న్యూఢిల్లీ, జనవరి 30: రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్టిక్రల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా.. తెలంగాణ విద్యుత్శాఖ అధికారుల బృందం ఆయా ప్రతిపాదనలపై అధ్యయనం చేసి.. 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది.
హిమాచల్ సీఎం సుఖ్విందర్సింగ్ సఖుతో గురువారం దిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్టాల్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 400 మెగావాట్ల సెలీ హైడ్రో ఎలక్టిక్ర్ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించారు. వాటికి సంబంధించిన ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి త్వరితగతిన ఎంవోయూపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.