విమాన ప్రమాదంలో అందరూ మృతి చెందినట్లే

  • ఇప్పటికే 28 మృతదేహాలు వెలికితీత
  • ప్రాణాలతో మిగిలే ఛాన్స్‌ లేదన్న అధికారులు

వాషింగ్టన్‌, జనవరి 30: వాషింగ్టన్‌ సవిూపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్‌ ఢీకొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్‌ వెల్లడిరచారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమన్నారు. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్‌ శకలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్‌ డొన్నెలీ తెలిపారు.

కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరిన పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుల విమానం వాషింగ్టన్‌ సవిూపంలోని రోనాల్డ్‌ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానాన్ని.. స్థానికంగా పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తోంది. ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఇక, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వీరి గురించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News