జాతిపితకు రాష్ట్రపతి.. ప్రధాని నివాళి

  • రాజ్‌ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించిన నేతలు

న్యూఢిల్లీ, జనవరి 30: జాతిపిత, స్వాతంత్య సమరయోధుడు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా జాతి యావత్తూ నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ నివాళులర్పించారు. వారు బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం నేడు గాంధీజికి నివాళులర్పించారు.

స్పీకర్‌ ఓం బిర్లా సైతం నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా జాతిపితకు నివాళి అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లి కార్జున ఖర్గేలు కూడా జాతిపితకు ఘనంగా నివాళి అర్పించారు. వీరంతా మహాత్ముడికి నివాళి అర్పించారు. పలు రాష్టాల్ల్రో ఆయా ముఖ్యమంత్రులు, మంత్రులు నివాళి అర్పించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News