హయత్ నగర్ పరిధిలో.. ఏళ్ళనాటి రోడ్డు సమస్యకు చెక్

హైదరాబాద్, జనవరి 29: మన్సూరాబాద్ డివిజన్లో.. ఆర్టీసీ కాలనీ రోడ్ నం 5 నుండి ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీ రోడ్డు మీదుగా జాతీయ రహదారి పైకి సులభంగా వెళ్లేందుకు 2006లో ఏర్పాటు చేసిన రోడ్డును వినాయక్ నగర్ కాలనీ వాసులు శర్మ, 2006లో వివిధ కాలనీలతో కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా గుర్రం బాల్ రెడ్డి, కమిటీ సహకారంతో చేసిన రోడ్డు పనుల పునరుద్ధరణ కోసం పాటుపడగా బుధవారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డితో వివిధ కాలనీ సంక్షేమ సభ్యులు అందరూ కలిసి రోడ్డును పునరుద్ధరణ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. 2006లో అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, సంబంధిత అధికారులతో విన్నవించుకొని జేఏసీ ఏర్పాటు చేసుకొని భూగర్భ డ్రైనేజ్, రోడ్డు భవిష్యత్తులో అభివృద్ధి చెందే కాలనీలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారుల్ని స్వయంగా ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేసిన రోడ్డును నేడు తన చేతుల మీదుగా మళ్లీ పునరుద్ధరణ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.

ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, అప్పటి జేఏసీ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. బొమ్మల గుడి వద్ద నుండి ప్రయాణించే వివిధ కాలనీవాసులు, ప్రధానంగా వినాయక నగర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ వాసులందరికీ సులభంగా జాతీయ రహదారి పైకి వెళ్లే విధంగా ఈ రోడ్డు ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఉన్న కాలనీల డ్రైనేజ్ ట్రంక్ లైన్ ఈ రోడ్డు లైన్ నుండే ఉందని వివరించారు. ప్రత్యేక శ్రద్ధతో ఎంతోమంది కాలనీ ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచనతో రోడ్డును పునరుద్ధరణ చేయడానికి ఆలోచించి వెలికి తీసి సహకరిస్తున్న వినాయక నగర్ కాలనీ సంక్షేమ సభ్యులకు, ఆర్టీసీ కాలనీ సంక్షేమ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులు సీతరామ శర్మ, బాల్ రెడ్డి, కళ్లెం రవీందర్ రెడ్డి, కళ్లెం శంకర్ రెడ్డి, జట్ట మహేష్, కొండల్ రెడ్డి, యాదగిరి, లక్ష్మణ, లక్ష్మయ్య, శ్రీనివాస్, రమణ, ప్రకేష్ రెడ్డి, కృష్ణ, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News