తెలంగాణాలో.. పంచాయితీ ఎన్నికలపై కసరత్తు

  • ఫిబ్రవరి 2 తరవాత రిపోర్ట్‌ ఆధారంగా కేబినేట్‌ చర్చ
  • మంత్రులు, అధికారులతో సిఎం రేవంత్‌ సవిూక్ష

హైదరాబాద్‌, జనవరి 29: పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసర్తత్తును ముమ్మరం చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే కులగణనకు సంబంధించిన నివేదిక ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ఈ లెక్కన బీసీలకు 42 శాతం సీట్లు రిజర్వ్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం మంత్రులు, సంబంధిత అధికారులతో సవిూక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే ప్రశంసలు అందుకుందని సీఎం చెప్పారు. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.సర్వేకు సంబంధించిన ముసాయిదా నివేదిక సిద్ధమైందని, ఫిబ్రవరి 2వ తేదీ నాటికి కేబినెట్‌ సబ్‌ కమిటీకి సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశానికి రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఫిబ్రవరి 2 తరువాత ఇప్పటికే పంచాయితీల్లో గతేడాది 2024, ఫిబ్రవరి1న సర్పంచ్‌ పదవీకాలం ముగియగా.. ప్రత్యేక అధికార పాలన వచ్చింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఓటర్ల జాబితాలను సైతం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. దీంతో ప్లలెలకు కేంద్రం నుంచి గ్రాంట్లు రావడం లేదు. త్వరగా ఎలక్షన్లు నిర్వహిస్తే కేంద్రం నిధులు వస్తాయి. ఫిబ్రవరి 2న కేబినెట్‌ సబ్‌ కమిటీకి రిపోర్టు అందితే.. ఆ నివేదికపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై దానిని ఆమోదిస్తుంది. తర్వాత బీసీ గణనకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు న్యాయనిపుణులతో రివ్యూ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రకియను ఫిబ్రవరి రెండో వారంలోగా నిర్వహించాలని నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 2లోపు డెడికేషన్‌ కమిషన్‌ రిపోర్టు ఇవ్వనుంది. రిపోర్టు వచ్చిన తర్వాత మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పంచాయితీరాజ్‌ ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జనకు గురవుతోంది. ఫిబ్రవరి 2 లోపు కేబినెట్‌ సబ్‌ కమిటీకి అందిస్తామని డెడికేషన్‌ కమిషన్‌ ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 తరువాత మరోసారి సమావేశమై పంచాయతీ ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. రిజర్వేషన్లపై పాత పద్ధతిలోనే వెళ్లాలా లేక న్యాయ స్థానాలలో పెంచుకునే అవకాశం పొందాలా అనేదానిపై సర్కార్‌ తర్జన భర్జనకు గురవుతోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పంచాయితీల్లో గతేడాది 2024, ఫిబ్రవరి1న సర్పంచ్‌ పదవీకాలం ముగియగా.. ప్రత్యేక అధికార పాలన వచ్చింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో ఎలక్షన్స్‌ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News