ఆయిల్‌పాం సాగులో.. తెలంగాణ నంబర్‌వన్‌ కావాలి

  • లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు చేపట్టాలి
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, జనవరి 29: ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్టాన్న్రి దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయిల్‌ పాం అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు చేపట్టలన్నారు. ఈ సంవత్సరంలో 16,729 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగు చేపట్టగా, మార్చిలోగా 19,271 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని, లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆయిల్‌ పాం గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్‌ పాం సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్‌ పాం ప్రాసెసింగ్‌ యూనిట్‌ జూన్‌ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌ పల్లి, కల్లూరు గూడంలలో ప్రాసెసింగ్‌ ప్యాక్టరీల నిర్మాణానకి టెండర్ల పక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు.

దీనివలన ఆయిల్‌ పాం సాగు చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందకు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు విూదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్‌ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు కార్పోరేట్‌ మోడల్లో వివిధ విభాగాలకు నిపుణత కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను రైతులకు మరియు పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అందించాలని సెస్‌ అధికారులను మంత్రి గారు ఆదేశించారు. అదనంగా ట్రాన్స్‌ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలన్నారు. ఈ పథకమును త్వరితగతిన అమలు చేయుటకు నేత కార్మికులకు అవగాహన కార్యక్రమములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 యూయిట్ల వరకు 50శాతం విద్యుత్‌ సబ్సిడీ అమలు చేయాలని, యారన్‌ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించినారు. ఆసాములకు నూలుకు అవసరమగు పెట్టుబడిని బ్యాంకుల ద్వారా అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ఆసాములు ఇతరుల విూద ఆధారపడకుండా స్వయంగా నూలు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. యారన్‌ డిపో లో నూలు స్టాకులను పెంచి నూలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

ఇప్పటిదాకా తమకు కావాల్సిన వస్త్ర ఇండెట్లు టెస్కో కు సమర్పించడం లేదో ఆయా శాఖలు విూద చర్యలు తీసుకొనుటకు, చేనేత సహకార సంఘాలకు మరియు పవర్‌ లూమ్‌ సంఘాలకు టెస్కో ద్వారా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సవిూక్షా సమావేశాలలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, సహకారశాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌
బాషా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News