పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందించిన ఘనత కేసీఆర్దె

  • మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అమీర్ పేట,మేజర్ న్యూస్: పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే అని మాజీ మంత్రి, సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తన కార్యాలయంలో అమీర్ పేట, బేగంపేట డివిజనులకు చెందిన 30మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి (21), షాదీ ముబారక్ (9) చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే పేద, మధ్య తరగతి కుటుంబాలకు భరోసా లభించిందన్నారు. ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వమే ఆర్థిక సాయం కింద లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్ వల్లనే నేటికి పథకం అమలులో ఉందన్నారు.పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమీర్ పేట డివిజన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నామన సంతోష్ కుమార్, నాయకులు శ్రీహరి, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శేఖర్, కూతురు నర్సింహా, గోపిలాల్ చౌహాన్, బలరాం, ఆరిఫ్, అఖిల్, హరిసింగ్, సుమిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News