వయస్సు సమస్యే కాదు: ప్రగ్యా జైస్వాల్‌

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జబల్‌ పూర్‌ సుందరి ప్రగ్యా జైస్వాల్‌. ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌తో నటించిన కంచె సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటించిన లెజెండ్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇటీవలే మరోసారి బాలకృష్ణతో కలిసి డాకుమహారాజ్‌లో మెరిసింది ప్రగ్యా జైస్వాల్‌. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్‌ హీరో బాలకృష్ణతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయడం, నటీనటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌. ఆయన ఒక లెజెండ్‌, బాలకృష్ణ పేరు చెప్పగానే నాకు పాజిటివిటీ అనే పదం గుర్తొస్తుంది. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

బాలకృష్ణ అందరినీ ఒకేలా గౌరవిస్తారు.. చాలా మంచి మనిషి. పాత్రకు తగ్గట్టుగా యాక్టర్లను సెలెక్ట్‌ చేస్తారు తప్ప వారి వయస్సును చూసి సినిమా అవకాశాలివ్వరంది. నా పాత్రకు వందశాతం న్యాయం చేశానా..? లేదా అనేదే ఆలోచిస్తాను. నా దృష్టిలో వయస్సు అనేది అసలు సమస్యే కాదు. అఖండలో మా ఇద్దరినీ స్క్రీన్‌పై చూసి షాకయ్యానంటూ చెప్పుకొచ్చింది. డాకు మహారాజ్‌ థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి అంతా నన్ను డాకు మహారాణి అని పిలుస్తున్నారు. ఆ పాత్రకు ప్రేక్షకులు అంతలా కనెక్ట్‌ అయ్యారు. ఒక నటిగా ఇది నాకెంతో సంతృప్తినిచ్చే విషయమంది ప్రగ్యా జైస్వాల్‌. ఈ భామ బాలకృష్ణతో మరోసారి అఖండ 2 సినిమాలో కూడా నటిస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News