సాయి పల్లవి కుర్రకారులో ఈ పేరుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రంతో నాయికగా పరిచయమైన ఈ అందాల తార తొలిచిత్రంతోనే యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రీడ్ పిల్ల అంటూ తొలిచిత్రంలో సందడి చేసిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే వచ్చిన క్రేజ్ను ఎప్పుడూ క్యాష్ చేసుకోవాలనుకోలేదు. సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్గా తన మనసుకు నచ్చిన కథలనే చేసుకుంటూ వెళుతుంది. అందుకే ఈ కథానాయికకు తెలుగు నాట కూడా ఇంత క్రేజ్, నానితో నటించిన ఏమ్సీఏ, ఇటీవల వచ్చిన ‘అమరన్’ చిత్ర విజయాల్లో సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా ‘అమరన్’ చిత్రానికి ఎటువంటి పబ్లిసిటి లేకపోయినా, కేవలం సాయి పల్లవి క్రేజ్తోనే ఆ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లను సాధించింది. ఇక తాజాగా ఈ క్రేజీ నాయిక నటిస్తున్న చిత్రం ‘తండేల్’. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఈ రోజు బజ్ రావడానికి సాయి పల్లవి కూడా ఓ ముఖ్య కారణం. తెలుగులో ఆమెకున్న క్రేజ్ ఖచ్చితంగా ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మంగళవారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా చూడ ముచ్చటగా ఉంది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సాయి పల్లవి మ్యాజిక్ ఈ చిత్రానికి ఎలాగు ఉంది. కాబట్టి తప్పకుండా ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లు సాధిస్తుందని, సాయి పల్లవి ఛరిష్మా, మ్యాజిక్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.