ప్రజావాణిలో.. 164 ఫిర్యాదులను పరిష్కరించాలన్న కమీషనర్

హైదరాబాద్‌, జనవరి 27: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి కమీషనర్ ఇలంబర్తి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఆయా విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా అందుతున్నందున వాటి పరిష్కారం పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ సంభందించిన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు అర్జీలను. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జాప్యం చేయరాదని తెలిపారు.

డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సమస్య పరిష్కరించ కలిగినదైతే వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించ లేనట్లైతే అందుకు గల కారణాలను ఆర్జీదారులకు వివరించాలని సూచించారు. ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 6 విన్నపాలు రాగా,సత్వర పరిష్కారం నిమిత్తం ఆయా విభాగాలకు పంపించడం జరిగింది.

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 73 విన్నపాలు రాగా అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 41, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ 8, హౌసింగ్ 4, ట్యాక్స్, ఫైనాన్స్, ల్యాండ్ అక్విజేషన్, వెటర్నరీ, యు.బి.డి విభాగాలకు మూడు చొప్పున, ఎలక్ట్రికల్ 2, శానిటేషన్, హెల్త్, ఎస్టేట్స్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 91 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 45, సికింద్రాబాద్ జోన్ లో 16, శేరిలింగంపల్లి జోన్ లో 17, చార్మినార్ జోన్ లో 6, ఎల్బీనగర్ జోన్ లో 7 ఆర్జీలు రాగా, ఖైరతాబాద్ జోన్ లో ఎలాంటి ఆర్జీలు అందలేదు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, సత్యనారాయణ, అశోక్ సామ్రాట్, రఘు ప్రసాద్, సుభద్ర దేవి, నళిని పద్మావతి, పంకజ, గీతా రాధిక, యాదగిరి రావు, అలివేలు మంగతాయారు, సి సి పి శ్రీనివాస్, సి.ఇ కోటేశ్వరరావు, యు.బి.డి డైరెక్టర్ వెంకటేశ్వర్, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, అడిషనల్ సి.సి.పి ప్రదీప్, ఎస్టేట్ అధికారి ఉమా ప్రకాష్, విజిలెన్స్ డి.ఎస్.పి సుదర్శన్, జె.సి రెవెన్యూ మహేష్ కులకర్ణి, హౌసింగ్ ఈ ఈ లు పి.వి రమణ, రాజేశ్వర్ రావు, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ మూర్తి రాజు, డిప్యూటీ సి.ఇ.ఓ పనస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News