హైదరాబాద్, జనవరి 23: లింగోజిగూడా డివిజన్ పరిధిలోని అధికారి నగర్ కాలనీ లో 10లక్షల రూపాయలతో జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన “ఓపెన్ జిమ్” ని కాలనీ ప్రజలతో ప్రారంభించిన జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిమ్ములు శారీర దారుడ్యానికి దోహదపడతాయన్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఓపెన్ జిమ్ములను సద్వియోగపరచుకొని చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం శ్రేయస్కరమన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రైవేట్ జిమ్ లకు వెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని తెలిపారు.
వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ద్వారా మీ కమ్యూనిటీ హాల్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది అని పేర్కొన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ గౌడ్, గౌస్, మహేశ్వరి, నరేష్, భాను, శివ, వినోద్ కాలనీ సభ్యులు మైసయ్య, దశరథ్, మహేందర్, జంగయ్య, యాదగిరి, యాదమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.