ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ వదంతులు నమ్మొద్దు

  • ప్రచారాన్ని ఖండించిన టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్‌, జనవరి 22: ఎలక్ట్రిక్‌ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్‌ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్పచ్రారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఎలక్టిక్ర్‌ బస్సుల మెయిన్‌టనెన్స్‌, ఛార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్‌ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం హైదరాబాద్‌తో సహా వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది.

జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌ రూట్లలో ఎక్కువగా ఎలక్టిక్ర్‌ బస్సులను సంస్థ తిప్పుతోంది. కేందప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్టిక్ర్‌ ఏసీ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌(జీసీసీ) పద్దతిన ప్రవేశపెట్టడం జరిగింది. పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది. ఆ బస్సుల మెయిన్‌టనెన్స్‌, ఛార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. 2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఎలక్టిక్ర్‌ బస్‌ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 550 ఇంటర్‌ సిటీ ఎలక్టిక్ర్‌ బస్సులకు మరియు 500 సిటీ బస్సులకు సొంత టెండర్‌ ద్వారా ఆర్డర్‌ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్‌ సంస్థల జాప్యం వల్ల మిగతా ఎలక్టిక్ర్‌ బస్సులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. మిగిలిన బస్సులు ఈ ఏడాది మే వరకు సంస్థకు అందజేస్తామని ప్రైవేట్‌ సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఆరు డిపోలతో పాటు వరంగల్‌-2, కరీంనగర్‌-2, నిజామాబాద్‌-2 డిపోల్లో ఈ ఎలక్టిక్ర్‌ బస్సులు నడుస్తున్నాయి.

ఎలక్టిక్ర్‌ బస్సుల వినియోగంలో దేశవ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తోంది. ఎలక్టిక్ర్‌ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోవిూటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. ప్రతి డిపో పరిధిలో రూరల్‌, అర్బన్‌, తదితర భిన్నమైన రూట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్‌ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదు. ఎలక్టిక్ర్‌ బస్సులు తిరిగే కిలోవిూటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుంది. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్‌, డీజిల్‌ మిశ్రమం ఉంటుంది. ప్రైవేట్‌ బస్సుల మాదిరిగానే ఎలక్టిక్ర్‌ బస్సులన్నీ టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఆ బస్సుల ద్వారా వచ్చే టికెట్‌ ఆదాయం నేరుగా సంస్థకే వస్తోంది. ఒప్పందం ప్రకారం తిరిగిన కిలోవిూటర్ల లెక్కన కంపెనీలకు నగదును చెల్లిస్తుంది. సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు జరగడం లేదనడంలో వాస్తవం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2500 కొత్త బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News