- ఏఐ యూనివర్సిటీలో భాగస్వాములు కండి
- బిల్గేట్స్ను కోరిన సిఎం చంద్రబాబు
- ఎఐ ఆధారిత అభివృద్దిపై ఇద్దరు చర్చలు
దావోస్, జనవరి 22: గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మైక్రోసాప్ట్ మాజీ సీఈవో బిల్గేట్స్తో చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని సీఎం కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వాములు కావాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రో సాప్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయా యని చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వాములు కావాలని కోరారు.
సీఈవో హెల్త్ ఇన్నొవేషన్, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఆఫ్రికా తరహాలో హెల్త్ డ్యాష్బోర్డ్ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. బిల్గేట్స్ సలహాలు రాష్ట్ర ఐటీ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. చాలాకాలం తర్వాత చంద్రబాబును కలవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బిల్గేట్స్ అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బిల్గేట్స్తో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘1995లో ఐటీ, 2025లో ఏఐ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తన సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు బిల్స్ గేట్స్తో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బిల్స్ గేట్స్తో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమపై నమ్మకంతో మైక్రోసాప్ట్ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారి పోయిన విషయాన్ని ఈ సందర్భంగా బిల్ గేట్స్కు గుర్తు చేశారు. అలాగే దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్టాన్న్రి గేట్వేగా నిలపాలని కోరారు. ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని బిల్స్ గేట్స్కు సీఎం చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టమ్ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్ బోర్డ్ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని సైతం అందించాలంటూ బిల్స్ గేట్స్కు సీఎం చంద్రబాబు కోరారు. విూ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు హావిూ ఇచ్చారు.