సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ

  • ఎమ్మెల్యే గోపీనాధ్‌ తీరుపై కార్పోరేటర్ల ఆగ్రహం

హైదరాబాద్‌, జనవరి 21: నగరంలోని జూబ్లీహిల్స్‌లో మరోసారి ప్రోటోకాల్‌ వార్‌ నెలకొంది. రెహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌ రెడ్డి , మంత్రుల ఫోటోలతో ప్లెక్సీలు లేకుండా ఎమ్మెల్యే మాగంటి తీసివేస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెహమత్‌నగర్‌లో ఆందోళనకు దిగిన స్థానిక కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఇంకా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని స్థానిక కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గోపీనాథ్‌ ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

గత మూడు నెలలుగా షాదీముబారక్‌, కళ్యాణ లక్ష్మి చెక్‌లు వచ్చినప్పటికీ సంతకాలు చేయడం లేదని విమర్శించారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కావాలనే చెక్‌లపై సంతకాలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ఫోటోలు తప్పకుండా ఉండాలన్నారు. షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రభుత్వం ఫోటోలు లేకుండా ప్రైవేటు కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఎమ్మార్వో ఆఫీసులో 500లకు పైగా చెక్‌లు ఉన్నాయని.. వాటిని పంపిణీ చేయకుండా.. కావాలనే కాలయాపన చేస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి మండిపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News