- లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కురుమ
హైదరాబాద్, జనవరి 21: రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో లాయర్స్ ఫోరం పర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమ గారు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 50% రిజర్వేషన్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయాన్ని పాటించాలని తెలియజేశారు.
సీనియర్ న్యాయవాది కిష్టగోని సదానందం మాట్లాడుతూ.. న్యాయవాదుల్లో సామాజిక న్యాయం కోసం లాయర్స్ ఫోరం రం ద్వారా పోరాటం కోసం నర్రి స్వామి ఆధ్వర్యంలో క్యాలెండర్ ని ఆవిష్కరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పీఠం ప్రదీప్, దర్శన్, రావుల చెన్నారెడ్డి, కైసర్, సతీష్, బిక్షపతి, శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్, వినోద్, సుమతి స్వప్న అనేక మంది న్యాయవాదులు పాల్గొన్నారు.