- మాముల్ల మత్తులో జీహెచ్ఏంసీ అధికారులు
- ప్రభుత్వ ఖజానాకు కుచ్చు టోపీ.. జేబులు నింపుకుంటున్న అధికారులు?
హైదరాబాద్, జనవరి 21: అక్రమ నిర్మాణాలకు అడ్డాగా ఆర్కే పురం డివిజన్ మారింది. దీంతో ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టి పెద్ద మొత్తం లో అధికారులు జేబులు నింపుకుంటున్నారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 60 గజాలలో గుడిసె వేసుకుంటే హడావుడి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు దాదాపు వాసవి కాలనీ మెయిన్రోడ్డు లో 500 గజాల స్థలంలో ఏలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ రేకుల షెడ్డు నిర్మించి వ్యాపారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి సరి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత అధికారులే ఈ అక్రమ నిర్మాణానికి వత్తాసు పలుకుతున్నట్లు మున్సిపల్ సిబ్బంది చెపుతుండడం గమన్హారం. ఆర్కే పరం లోని రోడ్ నెంబర్ 5లో దాదాపు 600 గజాలు స్థలంలో నాలుగు షటర్లు నిర్మించి హోటల్ ప్రారంభించేందుకు నిర్మాణదారుడు సిద్ధమయ్యాడు. నగరంలో రేకుల షెడ్లకు అనుమతులు లేకుండా అధికారులు ఇస్తున్నారని, లంచాలకు అలవాటు పడి చూసి చూడనట్లు వదిలేయడంతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
హోటల్ ప్రారంభం అయితే ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని కాలనీవాసులు వాపోతున్నారు. హోటల్ ప్రారంభమైతే మా కాలనీలో వాహనాల శబ్దం, కాలుష్యంతో ఇబ్బందులు తప్పవని అధికారులకు మొరపెట్టుకున్న చర్యలు తీసుకున్న పాపనా పోలేదు. ఇప్పటికైనా అనుమతులు లేని ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి రేకుల షెడ్ల అక్రమ నిర్మాణాలు ఆర్కేపురంలో పదుల సంఖ్యలో ఉన్న ఎక్కడ కూల్చివేసిన దాఖలాలు లేవు. కేవలం నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని బెదిరించి క్యాష్ చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.