దావోస్‌ చేరుకున్న సిఎం చంద్రబాబు, రేవంత్

  • ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్‌ సభ్యులు

అమరావతి, జనవరి 20: దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి నిన్న అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు ఉన్నారు. జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశం కానుంది. మరోవైపు దావోస్‌ సదస్సుకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపు ముచ్చటించుకున్నారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. మరోవైపు జ్యురిచ్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్‌పోర్టులో యూరప్‌ తెదేపా ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు, లోకేశ్‌తో ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు ఫొటోలు దిగారు.

 

 

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News