హైదరాబాద్, జనవరి 20: బీసీ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తన నివాసంలో గౌడ ఐక్య సాధన సమితి నూతన సంవత్సర 2025, క్యాలెండర్ ను రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, ఇతర ప్రతినిధులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అంబాల నారాయణ గౌడ్ కల్లుగీత కార్మికుల సమస్యలపైన మంత్రికి వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించిన అనంతరం మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి పరిశీలనకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు బబ్బురి బిక్షపతి గౌడ్, కోశాధికారి పుంజల హరిచరణ్ గౌడ్, రాష్ట్ర మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు బింగి ఇందిరా గౌడ్, బాబు గౌడ్, శ్రీహరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
