- సెవిూ కండక్టర్ల ఉత్పత్తిపై అశ్వినీ వైష్ణవ్తో చర్చ
న్యూఢిల్లీ,జనవరి 15: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. సెవిూ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని కేంద్ర ఎలక్టాన్రిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్రం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్బాబు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను ప్రత్యేకంగా కలిశారు. తెలంగాణలో సెవిూ కండక్టర్ల తయారీకి ముందుకొచ్చే పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇతర అంశాలను కేంద్ర మంత్రికి శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు.
ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయని, ఇలాంటి తరుణంలో డేటా భద్రత కీలకంగా మారిందన్నారు. అందుకే ’నేషనల్ డిజాస్టర్ రికవరీ జోన్’ ఏర్పాటు చేయాల్సి ఉందని ఈ అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఇకపోతే మరో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కూడా మంత్రి కలిశారు. పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.