చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

రంగారెడ్డి, జనవరి 15: చెరువులోకి కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షాద్‌నగర్‌కి చెందిన మల్లేశ్వర్‌ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుంచి కారులో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు మల్లేశ్వర్‌ రావును సురక్షితంగా బయటకు తీసారు. చెరువులో ఎక్కువ నీళ్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News